డైనోసార్ల మాదిరిగానే కాంగ్రెస్ అంతం: రాజ్ నాథ్ సింగ్

-

కాంగ్రెస్ పై డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్ లోని గౌచర్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ర్యాలీలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. పౌరి లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అనిల్ బలూని తరఫున రాజ్ నాథ్ సింగ్ ప్రచారం చేశారు.కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, డైనోసార్ల మాదిరిగానే కొన్నేళ్లలో అది అంతరించి పోతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గురించి అడిగితే.. ఎవరని? పిల్లలు ప్రశ్నిస్తారని ఆయన ఎద్దేవా చేశారు.ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఇండియా బలమైన దేశంగా మారిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. హస్తం పార్టీలో అంతర్గత పోరు బిగ్బాస్ రియాల్టీ షోను తలపిస్తోందని, రోజూ నాయకులు చొక్కాలు చించుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నుంచి వలసలు జోరుగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.బీజేపీ తాను చెప్పిన హామీలను యథాతథంగా అమలు చేస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version