పేదల కళ్ళల్లో కేసీఆర్ ప్రభుత్వం మట్టి కొట్టింది : ఈటల

-

బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని సురంగల్ గ్రామంలో ప్రధాన మంత్రి మోడీ జన్మదినం సందర్భంగా రైతులకు, వ్యవసాయ పనిముట్లు, వృద్దులకు, వికలాంగులకు అరోగ్య పనిముట్ల పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మాట్లడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజలు.. రెండే రెండు కోరుకుంటారని ఒకటి సొంత ఇల్లు.. రెండోది సచ్చిపోతే.. బొంద పెట్టడానికి కొంచెం జాగా కావాలని కోరుకుంటారని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ తెలిపారు. తొమ్మిది ఏళ్లైన రాష్ట్రంలో డబుల్ బెడ్రూంలు రాలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈటల రాజేందర్.

 

దేశంలో నరేంద్ర మోడీ 3.50 కోట్ల ఇళ్లను కట్టించాడని మన పక్క రాష్ట్రమైన ఏపీలో 20 లక్షల ఇల్లు కట్టించాడని సర్వేలు చెప్తున్నాయని ఈటల రాజేందర్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చకుండా పేదల కళ్ళల్లో కేసీఆర్ ప్రభుత్వం మట్టి కొట్టిందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి.. ఎన్నో ఏళ్ల నుంచి దున్నుకుంటున్న భూమిని ఈ ప్రభుత్వం గుంజుకుంటుందని ఈటల రాజేందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాను గ్రీన్ హౌస్ కల్టివేటింగ్ చేస్తానని చెప్పిన కేసీఆర్ అందులో భాగంగా పాలి హౌసు నిర్మించుకొవడానికి సబ్సిడీ ఇస్తానని చెప్పి.. ఇప్పటికే పాలి హౌస్ నిర్మించుకున్న రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న వారికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదని విమర్శించారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version