రేపు టీకా వేసుకోనున్న్ ఈటెల

-

రేపు తెలంగాణలో వాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో నాతో పాటూ సీఎస్, హెల్త్ సెక్రటరీ అధికారులు గాంధీలో పాల్గొంటామని ఆయన అన్నారు. మొదట ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే శానిటేషన్ వర్కర్ల నుంచి పై స్థాయి దాకా టీకా వేస్తారని అన్నారు. ఇపుడు వచ్చిన డోసుల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వాళ్లకు రెండు డోసులకు సరిపోతాయని అన్నారు.

కేంద్రం రెండో సారి డోసులు పంపగానే, మిగతా వాళ్లకు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. వాక్సిన్ ను అన్ని రకాల పరీక్షలు జరిగాకే.. అనుమతులు ఇచ్చారని వాక్సిన్ పై అపోహలు వద్దని అన్నారు. మొదటి డోస్ ఏ కంపనిది ఇస్తే రెండో డోస్ అదే ఇవ్వాలని ఆయన అన్నారు. అలానే గాంధీ ఆస్పత్రిలో రేపు టీకా వేసుకుంటానని ఈటల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version