వరదలైపోయాక కూడా చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారు – మంత్రి రోజా

-

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ మంత్రి రోజా. ఉదయం వీఐపీ దర్శన సమయం లో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భగవంతుడి దయవల్ల తాను మంత్రిని అయ్యానని చెప్పారు. అలాగే టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. కుప్పంను మునిసిపాలిటీగా కూడా చేసుకోలేని వ్యక్తి.. ముంపు గ్రామాలను జిల్లాగా చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.

వరదలైపోయాక కూడా చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించకుండా జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకున్నారని.. పోలవరం ను ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ మండిపడ్డారు. జగన్ పాలనలో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు రోజా. వచ్చే ఎన్నికల్లో వైసిపి 150 కి పైగా సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version