మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కారు డ్రైవర్‌కు కరోనా..!

-

తెలంగాణలో కరోనా విపరీతంగా పెరిగిపోతోంది. టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కారు డ్రైవర్‌కు కరోనా సోకింది. అతనికి పాజిటివ్ అని నిన్న సాయత్రం నిర్ధారణ అయ్యింది. వెంటనే డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. దీంతో కవిత, ఆమె కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత ఉంటున్నారు. అయితే దానికి ముందే మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘వెనకడుగేయని కాలం పేరే కేటీఆర్’ అనే పాటను కవిత విడుదల చేశారు.

 

ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన కొద్దిసేపటికే డ్రైవర్‌కు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కవిత హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక చూసుకుంటే.. తెలంగాణ వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉండి. ఎంతోమంది నాయకులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version