శ్రీశైలం ప్రమాద మృతులకి మరో 75 లక్షల ఎక్స్ గ్రేషియా

-

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల;ప డిఇ శ్రీనివాస్‌ గౌడ్‌ కుటుంబానికి రూ. 50 లక్షలు, మిగతా వారందరి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. దీంతో ఈ మొత్తంతో కలిపి డిఇ కుటుంబానికి రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని ఆయన వెల్లడించారు. అలానే మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్న ఆయన ఇతర శాఖాపరమైన సహాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version