పాకిస్తాన్కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ ఇప్పటికే చావుదెబ్బ కొట్టగా.. గురువారం ఉదయం లాహోర్లోని వాల్టన్ సైనిక విమానాశ్రయంతో పాటు గోపాల్నగర్ , నసీరాబాద్ ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి.దీంతో దట్టమైన పొగ ఆ ప్రాంతాలను పూర్తిగా కమ్మేసింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.సుమారు 5 నుంచి 6 అడుగుల పొడవు ఉన్న UAV డ్రోన్లు, వాటికి అమర్చిన బాంబుల వల్లే భారీ పేలుళ్లు సంభవించాయని పోలీసు వర్గాలు తెలిపాయి. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ పేలుళ్లు జరిగిన ప్రదేశాలకు చేరుకుని ఆధారాలను సేకరించగా.. దాడికి ఎవరు పాల్పడ్డారు అనేది మాత్రం తెలియాల్సి ఉన్నది.
Utter chaos in Lahore after drone strike at Walton Road which leads to Lahore cantonment. People out on streets in panic. Asim Munir's Jihadist policies have invited war to Pakistan's streets. pic.twitter.com/1195BQxlhf
— Divya Kumar Soti (@DivyaSoti) May 8, 2025