కంటతడి పెట్టుకున్న మిల్కీ బ్యూటీ…తమన్నాకు అసలేం జరిగిందంటే?

-

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా..ప్రజెంట్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా దాదాపుగా యాక్ట్ చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ సుందరి F3 ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.

 

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కు జోడీగా నటించింది. వరుణ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా కౌరా, సునీల్, సోనాల్ చౌహాన్ లూ ఈ సినిమాలో నటించారు. ఎఫ్ 2కు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో వినోదం రెట్టింపు స్థాయిలో ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి హామీ ఇచ్చేస్తున్నారు.

ఈ నెల 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అనిల్ రావిపూడి, తమన్నా భాటియా, సోనాల్ చౌహాన్, సునీల్ తాజాగా..యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిహిస్తున్న ఈటీవీ మల్లెమాల వారి ‘క్యాష్ ప్రోగ్రామ్’లో పార్టిసిపేట్ చేశారు. వీరు పార్టిసిపేట్ చేస్తు్న్న ఈ ప్రోగ్రాం క్యాష్ కు 200వ ఎపిసోడ్ కావడం విశేషం.

‘క్యాష్’ నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. కానీ, చివరకు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కంటతడి పెట్టడం చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆమె ఎందుకు ఏడ్చింది అనేది తెలియాలంటే ఈ నెల 14న టెలికాస్ట్ కానున్న క్యాష్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version