Big Boss OTT Telugu: టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కాని వారు ఎవరు? కంటెస్టెంట్స్‌కు ‘బిగ్ బాస్’ ఇంట్రెస్టింగ్ టాస్క్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ ’ పదకొండో వారంలోకి ఎంటరయింది. పదో వారంలో అషురెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే గేమ్ ఇంకా రసవత్తరంగా మారింది. ఉన్న వారిలో పోటీ పెరిగింది. తాజాగా ‘బిగ్ బాస్’ ఇంటి సభ్యులకు వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చాడు. ఈ సంగతి తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. సదరు ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మీ అభిప్రాయంలో ఏ ముగ్గురికి టాప్ ఫైవ్ లో నిలిచే అర్హత లేదో చెప్పాలని ‘బిగ్ బాస్’ సూచించాడు. ఆ ముగ్గురిని ఎగ్జిట్ ఫ్రేమ్ కింద నిలుచొబెట్టి తగిన కారణాలు చెప్పాలన్నాడు. దాంతో కంటెస్టెంట్స్ కారణాలు చెప్పేందుకు రెడీ అయిపోయారు.

తొలుత బిందు మాధవి.. మిత్రాశర్మను గురించి కారణం చెప్పింది. ఎవరూ లేరనే అబద్ధపు ఇమేజ్ తో ఇప్పటి వరకు ఇక్కడి వరకు మిత్రాశర్మ వచ్చిందని చెప్పింది.ఇక అఖిల్ గురించి ఏదో చెప్పబోతుంటే అతను అడ్డు తగిలితే అఖిల్ సార్థక్ కు బుర్రా లేదని అంది బిందు మాధవి.

నటరాజ్ మాస్టర్- బిందు మాధవి మధ్య మాటల యుద్ధం జరిగింది. తాను దొంగ మాటలు మాట్లాడనని నటరాజ్ అన్నాడు. ఈ క్రమంలోనే అరియానా – మిత్రా శర్మ మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలుగమ్మాయికి ఉండాల్సిన లక్షణం ఒక్కటి లేదని నటరాజ్ మాస్టర్ బిందు మాధవిపై ఫైర్ అయ్యాడు.

తాను బెడ్ మీద కూర్చొని కాలు ఊపలేదని అన్నాడు నటరాజ్. తాను తెలుగు వాడిని అని, కష్టపడి ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నానని అన్నాడు. బిందు నవ్వు సూర్పనక నవ్వు అని కామెంట్ చేశాడు. అంతటితో ప్రోమో ముగిసింది. ఇంతకీ హౌజ్ లో ఏం జరిగింది అనేది తెలియాలంటే రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTTలో స్ట్రీమ్ అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version