సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్ అనేది చర్చనీయాంశం అయ్యింది. ఫేక్ ఐడెంటీ కార్డులతో సచివాలయంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా రోజుకో నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నారు సచివాలయ భద్రతా సిబ్బంది. ఈ రోజు మరో ఫేక్ ఉద్యోగిని పట్టుకున్నారు సెక్రటేరియట్ సెక్యూరిటీ. తాను తహసీల్దార్ అంటూ సచివాలయంలోకి వచ్చాడు కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి.
అయితే ఈ తహసీల్దార్ అనే స్టిక్కర్ ఉన్న వాహనంలో గత కొద్దిరోజులుగా సచివాలయంలోకి వస్తున్నాడు అంజయ్య. దాంతో అనుమానం వచ్చి ఈ రోజు అంజయ్య ను పట్టుకున్నారు సచివాలయం సెక్యూరిటీ. అనంతరం అంజయ్యను సైఫాబాద్ పోలీసులకు అప్పగించి.. అతని పై కేసు నమోదు చేసారు. అంజయ్య వద్ద నుంచి ఫేక్ ఐడి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఓ జిరాక్స్ సెంటర్ లో ఈ ఫేక్ ఐడి కార్డ్ తయారు చేపించినట్లు పోలీస్ విచారణలో తెలిపాడు అంజయ్య. దీంతో ఈ ఫేక్ ఉద్యోగి దందాల పై విచారణ మొదటు పెట్టారు పోలీసులు.