మొన్న కేసీఆర్, ఈరోజు సంతోష్ కుమార్…నకిలీల కలకలం !

-

ఈ మధ్య కాలంలో నకిలీ కేటుగాళ్ళు ఎక్కువయిపోయారు. మొన్నటికి మొన్న కరీంనగర్ లో నాకు కేసీఆర్, కేటీఆర్ లు తెలుసు అంటూ ఎంతో మందిని మోసం చేయగా ఇప్పుడు కేసీఆర్ సన్నిహితుడు ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించాడు ఒక మైనర్ బాలుడు. నకిలీ ఫేస్బుక్ ఖాతా తో పలువురికి మెసేజ్ లు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మైనర్ బాలుడు పంపించినట్టు గుర్తించారు పోలీసులు. ఎంపీ పేరుతో డబ్బులు అవసరం ఉన్నాయి అన్న మెసేజ్లు పంపించాడు సదరు బాలుడు. 50 వేల రూపాయలను తన గూగుల్ పే నెంబర్ కి పంపించాలని సదరు బాలుడు కోరాడు.

మళ్లీ ఆ డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించాడు కేటుగాడు. అయితే అనుమానం వచ్చిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్బుక్ ఐడి ఆధారంగా ఉత్తరప్రదేష్ కి చెందిన మైనర్ బాలుడిగా గుర్తించారు. ఎస్వోటీ పోలీసులు ఉత్తరప్రదేశ్ వెళ్లి ఎంపీ పేరుతో నకిలీ ఖాతా ను సృష్టించిన మైనర్ బాలులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి మోసాలు ఏమైనా గతంలో చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు వసూలు చేసే ముఠాలు చాలా ఉంటాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version