Allu Arjun : ఐకాన్ స్టార్‌కు అదురైన బ‌హుమ‌తి.. 160 ఏళ్ళ పురాతన వ‌స్తువును అందించిన వీరాభిమాని

-

Allu Arjun : అల్లు అర్జున్.. ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే. ఆయ‌న‌కు తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్‌కు అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల్సిన అవ‌స‌రం లేదు. అప్పుడప్పుడు త‌న ఫ్యాన్స్ ప్రేమతో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్ కి ఆయన కేరళ అభిమాని ఓ అరుదైన వ‌స్తువును బ‌హుమ‌తిగా అందించాడు. త‌న అభిమానాన్ని చాటుకున్నాడు.

వివరాల్లోకెళ్తే.. కేరళలో పుట్టి పెరిగి దుబాయ్ లో నివాస‌ముంటున్న మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్. ఆయ‌న అనే అల్లు అర్జున్ వీరాభిమాని. ఇటీవ‌ల త‌న అభిమాన హీరో అల్లు అర్జున్ యూఏఈకి వ‌చ్చాడ‌ని తెలుసుకున్నాడు. ఆయ‌న ఎలాగైనా మీట్ కావాల‌ని ప్ర‌య‌త్నించి కలుసుకున్నాడు.

ఈ సందర్భంగా ఆయన అల్లుఅర్జున్ కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ పురాతన పిస్టల్ ను బహుమానంగా ఇచ్చి అందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఒమర్ లులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన అభిమాన హీరోకి ఇది ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియచేసాడు ఈ కేరళ అభిమాని రియాజ్.

అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా మొదటి పార్ట్ ని త్వరలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజర్, సాంగ్ తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడని
అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version