BRAKING : కడపలో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి

-

దేశంలో మరియు రాష్ట్రంలో రెండు రోజులకు రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనలు అమలు చేసినప్పటికీ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కడపలో ఘోర రోడ్డు ప్రమాదం… చోటు చేసుకుంది.

చెన్నై కర్నూలు జాతీయ రహదారిపై పాలెంపల్లె రాచిన్నాయ పల్లె బైపాస్ రోడ్డుపై లారీ బైక్ ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు చెన్నూరుకు చెందిన వారుగా గుర్తించారు. ఇక ఈ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు చెన్నూరు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version