భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం కారణంగా భారతీయులకు కొత్త సందేహం వచ్చింది.దేశంలో చమురు నిల్వలు దగ్గర పడ్డాయని సోషల్ మీడియాలో కథనాలు చూసి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత పౌరుల సందేహాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేసే ప్రయత్నం చేసింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతున్న వేళ అవన్ని అవాస్తవాలే అని ఇండియన్ ఆయిల్ సంస్థ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇంధన సరఫరాలో కూడా ఎటువంటి ఆటంకాలు లేవని ఓ ప్రకటనలో పేర్కొంది. యుద్ధ భయంతో ప్రజలు పెట్రోల్ బంకులు, గ్యాస్ డీలర్ల వద్దకు పెద్ద ఎత్తున వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరింది.