టెన్షన్ టెన్షన్.. గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు

-

ఇరాన్​కు చెందిన ఓ పాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం గగనతలంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ బెదిరింపు రావడంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యారు. కానీ వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

అప్రమత్తమైన అధికారులు వెంటనే భారత వాయుసేనను రంగంలోకి దించారు. వాయుసేన ఫైటర్ జెట్​లు.. ఆ పాసింజర్ విమానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విమానం చైనా దిశగా సాగుతోంది. ఇరాన్​కు చెందిన ఆ విమానం గమ్యస్థానం చైనా అని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా సంస్థలు ఆ విమానం కదలికల్ని నిశితంగా గమనిస్తున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version