సికింద్రాబాద్ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం.. మూడో అంతస్తులో చిక్కుకున్న పలువురు

-

సికింద్రాబాద్‌ డెక్కన్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది.  స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని మూడో ఫ్లోర్‌లో కొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. కాంప్లెక్స్‌లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. భవనం లోపలికి వెళ్లి చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదంతో భారీగా పొగ వ్యాపిస్తోంది. దీనివల్ల అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వేసవి కావడంతో మంటలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి.

కానీ ఇవాళ వాతావరణం కాస్త చల్లబడటం ఈ ఘటన ఉద్ధృతం కాకుండా చేసినట్టైందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండటం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ట్రాఫిక్ స్తంభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version