పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్ధం

-

కృష్ణా: బాపూలూరు మండలం అంపాపురంలో అగ్నిప్రమాదం జరిగింది. పామాయిల్ కంపెనీలో మంటలు ఎగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలు వాహనాలకు నిప్పు అంటుకుంది. ప్రొక్లెయిన్ ట్రాక్టర్ దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో ఎవరూ లేనట్లు గుర్తించారు.

కాగా గ్రామ శివారులో ఈ కంపెనీ ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. షార్ట్ సర్య్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చిని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో విచారణ చేపట్టారు. కంపెనీ యజమానులకు సమాచారం అందజేశారు. ప్రమాదంపై నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version