మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని గొంతు కోసుకొని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండ గ్రామానికి చెందిన కీర్తీ, ఉపేందర్ దంపతుల కుమారుడు వివేక్ (20) హైదరాబాద్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఇంట్లో ఎవరు లేని సమయంలో బాత్ రూంలోకి వెళ్లి గొంతు, చెయ్యి కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు వివేక్. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.