ఏప్రిల్ 1న జనాలను ఫూల్స్ చేసి.. జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారు – బోండా ఉమ..

-

విజయవాడ: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ధర్నా చౌకులో ధర్నా చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను మోసం చేశారు. బాదుడే బాదుడు అన్న జగన్.. నిజమైన బాదుడు ఎలా ఉంటుందో ఆచరించి చూపాడు. ఓట్లేసిన జనాలను పిచ్చోళ్లని చేసి ఉగాది కానుకగా విద్యుత్ ఛార్జీలు పెంచారు.

 

 

గడపల ముందుకు వస్తున్న వైసీపీ నాయకులను చొక్కాలు పట్టుకుని నిలదీయండి. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేసారు బోండా ఉమ. పనులు లేక పస్తులుండే పరిస్థితి ఉంటే.. మళ్లీ ఈ కొత్త బాదుడు. ఏప్రిల్ 1న జనాలను ఫూల్స్ చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు. జగన్ను తరిమికొట్టేందుకు జనం ఎదురు చూస్తున్నారు. చివరికి శ్వాస తీసుకున్న పన్ను కట్టిస్తాడేమో అన్న బోండా ఉమ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version