మోడీకి ధ‌న్య‌వాదాలు చెప్పిన పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల.. ఎందుకంటే?

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని పార్ల‌మెంట్ సాక్షిగా అంగీక‌రించినందుకు ప్ర‌ధాని మోడీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయితే పార్ల‌మెంట్ కాంగ్రెస్ పార్టీ పై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. కాంగ్రెస్ పార్టీ యే అయినా.. బీజేపీ మ‌ద్ధ‌తు కూడా తెలిపిందని అన్నారు. దీన్ని తాము ఒప్పుకుంటామ‌ని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స‌హ‌క‌రించిన బీజేపీ కూడా రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి.. ఓడిపోయింద‌ని అన్నారు. అలాగే దాదాపు 100 అసెంబ్లీ స్థానాల్లో క‌నీసం డిపాజిట్లు కూడా రాలేద‌ని ఎద్దేవ చేశారు.

అలాగే బీజేపీ ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలో మూడు రాష్ట్రాలు ఏర్పాడ్డాయని అన్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిందా అని ప్ర‌శ్నించారు. అలాగే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల కోసం బ‌డ్జెట్ ను కూడా మోడీ రాజ‌కీయం చేశారని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version