ఏపీలో గంజాయి కలకలం.. 90.5 కిలోలు స్వాధీనం

-

ఏపీలో మరోసారి గంజాయి కలకలం సృష్టించింది.బెజవాడలోని కృష్టవరం టోల్‌ప్లాజా వద్ద టీఆర్ఐ తనిఖీలు నిర్వహిస్తుండగా..సోమవారం 2 వాహనాల్లో భారీగా గంజాయి పట్టుబడింది. దీనిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.మొత్తం రూ.1.61 కోట్ల విలువైన 808 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలాఉండగా, విజయవాడలో ఇటీవల గంజాయి పట్టివేత కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

రెండు నెలల కిందట మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక పీఎస్‌ల పరిధిలో 15మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
వారి నుంచి 90.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. ఇక ఏపీలో గంజాయి మత్తుని వదిలించేందుకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో సీపీ రామకృష్ణ స్పెషల్ ఫోకస్ పెట్టారు.ఏసీపీ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. జోనల్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి కట్టడి కోసం అన్ని విధాలుగా శ్రమిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version