గుంటూరులో పెళ్లి పేరుతో యువకుడు ఘరానా మోసం..!

-

గుంటూరు జిల్లాలో పెళ్ళి పేరుతో ఓ యువకుడు మోసం చేశాడు. ఎన్ఆర్ఐ సంబంధం పేరుతో ఓ రైతు కుటుంబానికి టోకరా వేశాడు. అమ్మాయిల నుండి 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం కట్నం తీసుకున్నాడు. ఎన్ఆర్ఐ సంబంధం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు గ్రాండ్ గా వివాహం జరిపించారు. శోభనానికి ఏర్పాట్లు చేస్తే నాలుగు రోజులు అనారోగ్యంతో తప్పించుకున్నాడు యువకుడు.

Pelli

యువకుడి ప్రవర్తనలో మార్పు వచ్చేసరికి యువతి అతనిని గట్టిగా నిలదీశాడు. దీంతో యువకుడు తాను గేనని విషయం చెప్పాడు. దింతో అసలు అసలు విషయం బయట పడటంతో అందరు షాక్ కి గురైయ్యారు. అమెరికాలో నాలుగేళ్ళుగా ఓ బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తున్నట్లు తెలిపాడు. యువతీ అమెరికా వెళ్లిన తరువాత తన బాయ్ ఫ్రెండ్ తోనే కాపురం చేయాలని చెప్పడంతో యువతి షాక్ గురైయ్యింది. కూతురు నిజం చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైయ్యారు. యువతీ కుటుంబ సభ్యులు యువకుడిని ప్రశ్నించగా అతడు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబం తమకు న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీని ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version