రైతులకు గుడ్ న్యూస్…. పీఎం కిసాన్ నిధులు విడుదల

-

పీఎం కిసాన్ 17వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. యూపీలోని వారణాసిలో కిసాన్ సదస్సులో మోదీ డబ్బులు విడుదల చేశారు. ప్రధానిగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ ఫస్ట్ సంతకం పీఎం కిసాన్ నిధులపై చేసిన విషయం తెలిసిందే.

ఇవాళ వారణాసికి తొలి సారి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. పీఎం కిసాన్ 17వ విడత నిధుల్ని మోదీ విడుదల చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 9 కోట్ల 26లక్షల మంది రైతుల అకౌంట్లోకి 20వేల కోట్ల రూపాయలను జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో రూ. 2000 జమ కానున్నాయి.అంతేకాకుండా.. వ్యవసాయ పద్ధతులతో రైతులకు మద్దతుగా నిలుస్తూ పారా – ఎక్స్‌టెన్షన్ వర్కర్లుగా పనిచేయడానికి ‘కృషి సఖి’లుగా శిక్షణ పొందిన 30వేల మందికి పైగా స్వయం సహాయక బృందాల సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ సర్టిఫికేట్‌లను అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version