పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా బంగారంరం ధరలు

-

సామాన్యులకు ఊరట కలిగించేలా నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంటారు. ధరలు పెరిగిన పసిడి వ్యాపారాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది.

నిన్న కూడా ఇదే ధరలు కొనసాగాయి. కాకపోతే దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్పమార్పులు ఉండేవి. ఇక పసిడి ధరలు స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. చెన్నై లో కిలో వెండి ధర రూ.67,700 ఉండగా, ముంబైలో రూ.62,200 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,200 ఉండగా..కోల్కతాలో రూ. 62,200 వద్ద కొనసాగుతోంది.బెంగుళూరులో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, హైదరాబాదులో రూ. 67,000 ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version