MS ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

-

మాజీ ఇండియా కెప్టెన్ మరియు ప్రస్తుతం ఐపిఎల్ టీమ్ చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటతో మరియు తనదైన మంచితనంతో ప్రపంచం నలువైపులా కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నాడు. ఈయన జీవిత చరిత్రను కూడా MS ధోనీ ది అంటోల్డ్ స్టోరీ పేరుతో సినిమాగా చిత్రీకరించారు. క్రీకెట్ లాగా సినిమాలో కూడా ధోనీ అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇందులో ధోనీ పాత్రను బాలీవుడ్ దివంగత యంగ్ హీరో సుశాంత్ సింగ్ నటించి అదరగొట్టాడు. కాగా ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ థియేటర్ లలో చూసే అవకాశాన్ని ధోనీ అభిమానులకు నిర్మాతలు కల్పించనున్నారు.

ఈ సినిమాను మరి వారం రోజుల్లో థియేటర్ లలో ప్రదర్శిస్తారు అని చిత్ర బృందం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఐపిఎల్ జరుగుతుండడంతో ధోనీ కున్న మైలేజ్ ను వాడుకోవాలని ఈ సినిమా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మరి సక్సెస్ అవుతారా లేదా అన్నది తెలియాలంటే మరొక వారం ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version