గ్రేటర్ ఎన్నికలు: బిజెపి మరో కీలక అడుగు

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం తీవ్రంగా కష్టపడుతుంది. గ్రేటర్ ఆశావాహులకు బీజేపీ ఆహ్వానం పలికింది. బీజేపీ తరుపున పోటీకి ఆసక్తి ఉన్న వాళ్ళ నుంచి బయోడేటాల స్వీకరిస్తుంది. నేటి ఉదయం 10గంల నుంచి నుంచి సాయంత్రం 5గంటల లోపు ఆశావాహుల నుంచి బయోడేటాలను గ్రేటర్ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు తీసుకుంటారు.

గ్రేటర్ పరిధిలో ఆరుగురు అధ్యక్షులను బీజేపీ నియమించింది. డివిజన్లు వారీగా అభ్యర్థుల పనితీరుపై సర్వే చేయించనున్న రాష్ట్ర నాయకత్వం… సర్వేలో ముందు వరుసలో ఉన్న వారికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇక గ్రేటర్ లో పోటీ చేసే అభ్యర్ధులకు ఎలాంటి రుసుము లేకుండానే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version