రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తాం : ఏపీ ప్రభుత్వం

-

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2023 మార్చి నాటికి 100% వ్యవసాయ కలెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 41 వేల వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లు ఇచ్చామని, త్వరలోనే మరో 77 వేల కలెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

cm jagan

విద్యుత్ రాయితీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం మంది రైతులు డిబిటి కోసం ఖాతాలు తెరిచారని చెప్పారు. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు నష్టపోయేది ఏమీ లేదని వివరించారు. స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపుల్లో ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేసిన శ్రీకాకుళం జిల్లాలో ఇది ఇప్పటికే నిరూపితం అయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version