అలా చెప్పి ఉంటే కాంగ్రెస్ 30 సీట్లు కూడా గెలవలేకపోయేది : కేటీఆర్

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ ముందే చెప్పి ఉంటే ఆ పార్టీ 30 సీట్లనూ గెలవలేకపోయేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అచ్చంపేటలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..మహబూబ్నగర్లో 12 స్థానాల్లో గెలుస్తామని ఆ పార్టీ నేతలే ఊహించలేదన్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో తెలియట్లేదని దుయ్యబట్టారు.

ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ అందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇస్తామని కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారని కేటీఆర్‌ ఆరోపించారు . బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, వాళ్ల అరాచకాలు కొద్ది రోజులు భరిస్తామని.. తర్వాత వాళ్లు ఇటుకలతోని కొడితే తాము రాళ్లతోనే కొడతామని అన్నారు.రేవంత్ రెడ్డి సీఎం లెక్క మాట్లాడడం లేదని.. లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నాడని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version