బీజేపీ నేతల తిట్లు..కేసీఆర్ ను బలవంతున్ని చేశాయి – మోడీకి హరీష్‌ కౌంటర్‌

-

బీజేపీ నేతల తిట్లు..కేసీఆర్ ను బలవంతున్ని చేశాయంటూ ప్రధాని మోడీకి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. నిన్న తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ…టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.

అయితే, ప్రధాని మోడీ…కేసీఆర్‌ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు.. ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ అంటూ చురకలు అంటించారు మంత్రి హరీష్ రావు. దేశానికీ తెలంగాణ కు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోడీ జీ అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version