ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అబద్ధాల మంత్రి గా మారిపోయారు – బండి సంజయ్

-

ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అబద్ధాల మంత్రి గా మారిపోయారని బండి సంజయ్ ఓ రేంజ్‌ లో సెటైర్లు పేల్చారు. ఇటీవల ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన సంఘటన తెలంగాణలో తీవ్ర కళకళం రేపింది.

అయితే.. దీనిపై బుధవారం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు , ఎమ్మెల్యేలు ఎందుకు బాధితులను పరామర్శ చేయలేదని నిలదీశారు. భూమి,ఇసుక, లిక్కర్,క్యాసినో ఆడుకుంటూ బిజీగా ఉన్నారా ? సీఎం వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని వార్నింగ్‌ ఇచ్చారు.

సీఎంకు పేరు ప్రఖ్యాతలుు ముఖ్యమా.. పేదల ఆరోగ్యం ముఖ్యమా? అని ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను సీఎం ఎందుకు పరామర్శించడం లేదని ఫైర్ అయ్యారు బండి సంజయ్. కెసిఆర్ నువ్వు మనిషివా.. రాక్షసుడివా.. నీ నిర్లక్ష్యం వల్లే నలుగురి మహిళలు ప్రాణాలు కోల్పోయారంటూ మండిపడ్డారు. ఇక్కడ మరణించిన వారిని పట్టించుకోకుండా రాజకీయాలు చేయడానికి బీహార్ వెళ్లాడని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version