ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఉద్రిక్తత

-

హైదరాబాదులోని ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అక్రమంగా అరెస్టు చేశారంటూ.. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నేతలు, రాజాసింగ్ మద్దతుదారులు ఆయనకి మద్దతుగా ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. వెంటనే రాజాసింగ్ ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

భక్తులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. నిరసనకారులను అడ్డుకున్నారు. వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించినప్పటికీ వారు శాంతించలేదు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, వారికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులను అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version