గత ఐదేళ్లలో ఏ గ్రామంలో అయినా బండి సంజయ్ కనిపించాడా? : మంత్రి పొన్నం ప్రభాకర్

-

తెలంగాణ లో ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదములు, ఆశీర్వచనములు అందజేశారు. వారి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ….బండి సంజయ్ తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది 2 రోజులు నిద్ర పోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేతులెత్తి మొక్కుతూ.. దండం పెట్టి చెబుతున్నానని.. ఇలాంటి మూర్ఖుడి స్వభావాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. గత ఐదేళ్లలో ఏ గ్రామంలో అయినా సంజయ్ కనిపించాడా? అని ప్రశ్నించారు. ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version