మీ నాయకుడు మోడీని, ఓబీసీలను తిట్టింది మరిచారా? ఖర్గేకు నడ్డా కౌంటర్

-

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వాటిని నియంత్రించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే భారత ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.దీనిపై తాజాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. రాహుల్ గాంధీ సహా మీ నాయకులు చేసిన అకృత్యాలను మరచారా? అని లేఖలో ప్రశ్నించారు.

ఖర్గే లేఖలో పేర్కొన్న విషయాలు వాస్తవానికి సుదూరంగా ఉన్నాయన్నారు. ‘ప్రజల ద్వారా పదేపదే తిరస్కరించబడిన మీరు. తిరిగి మార్కెట్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ లేఖ రాసినట్టు అర్థమవుతోంది.‘రాహుల్ దేశ ప్రధానితో సహా మొత్తం ఓబీసీ వర్గాన్ని దొంగలు అంటూ దుర్భాషలాడారు.ఏకంగా ప్రధానిపై అసభ్య పదజాలం ఉపయోగించారు.ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు. అటువంటి వ్యక్తిని మీరు బలవంతంగా ఎలా సమర్థిస్తారు’ అని నడ్డా ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకులు చేసిన దుశ్చర్యలను ఉద్దేశపూర్వకంగా లేఖలో పొందుపరచడం విస్మరించినట్లు కనిపిస్తోందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version