హెచ్‌డి రేవణ్ణకు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ

-

సంచలనం సృష్టిస్తున్న సెక్స్ టేప్ స్కాండల్ కేసులో అరెస్టైన కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణకు కోర్టు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో మే 04న సిట్ బృందం ఆయన్న అరెస్ట్ చేసింన విషయం తెలిసిందే. రేవణ్ణ కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లిని లైంగికంగా వేధించారని ఆ మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై కిడ్నాప్ కేసు నమోదైంది.

అయితే ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకే మహిళను రేవణ్ణ కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా హాసన్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. ఇక ఆ మరసటి రోజు సెక్స్ స్కాండల్ తెరపైకి వచ్చింది.మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ అనేక మంది మహిళలపై లైగింక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ క్రమంలో ప్రజ్వల్ రేవణ్ణను జెడీఎస్ సస్పెండ్ చేసింది. వీడియోలు బయటకు రావడంతో ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news