మూడు గంటలు నిలిచిపోనున్న UPI సర్వీసులు..!

-

ప్రస్తుతం భారత్ లో క్యాష్ పేమెంట్స్ కంటే ఎక్కువ మంది UPI పేమెంట్స్ నే వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో మూడు గంటలు UPI సర్వీసులు నిలిచిపోతున్నాయి అంటే ప్రజలకు సమస్య అనే చెప్పాలి. కానీ ఈ సమస్య అందరి కాదు. కేవలం HDFC బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే. రేపు HDFC బ్యాంకు తన UPI సేవలను ముఫు గంటల పాటు నిలిపివేయనుంది.

ఈ ఆగస్టు 10న తమ బ్యాంక్ సిస్టమ్ మెయింటెనెన్స్ వల్ల తమ వినియోగదారులకు మూడు గంటల పాటు UPI సర్వీస్ అందుబాటులో ఉండటం లేదు అని పేర్కొంది. ఈ మేరకు HDFC ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే వినియోగదారులకు అధిక ఇబ్బంది కలగకుండా ఉండేలా.. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు UPI సేవలు నిలిపివేసింది HDFC. అయితే ఆ సమయంఓ ఎక్కువ మంది UPI సేవలు వాడరు అనేది తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version