పుట్టిన రోజు నాడు పోలీసులకు భయపడి చనిపోయాడు…!

-

కరోనా లాక్ డౌన్ లో చాలా మంది పోలీసులకు భయపడి ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఎక్కడ బయటకు వెళ్తే ఎక్కడ తమను కొడతారో పరువు పోతుందో అని చాలా మంది ఇంట్లోనే ఉండిపోతున్నారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. దీనితో లాక్ డౌన్ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇదే ఒక యువకుడి కొంప ముంచింది.

పోలీసులకు భయపడి బావిలో పడి చనిపోయాడు. ఈ ఘటన తెలంగాణాలో జరిగింది. కరీంనగర్ జిల్లా   పుట్మ్కట మండలం కొత్తపల్లి గ్రామంలో తన పుట్టిన రోజు సందర్భంగా రాజగోపాల్ అనే యువకుడు ఇల్లంతా కుంట మండలం మల్యాల గ్రామంలో స్నేహితులతో కల్లు పార్టీ కోసం అని వెళ్ళాడు. అయితే లాక్ డౌన్ పహారాలో భాగంగా కొందరు పోలీసులు అటు వైపు వచ్చారు. దీనితో కల్లు తాగుతున్న గోపాల్..

భయం తో పరుగులు తీసి బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. పుట్టిన రోజు నాడే అతను ఇలా చనిపోవడంతో తల్లి తండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఇక అతని స్నేహితులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా సరే పెద్దగా ఫలితం లేకుండా పోయింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలి అని అతని తల్లి తండ్రులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version