భీమవరం వచ్చిన ప్రధాని మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు: సీఎం జగన్

-

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా భీమవరం లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..” ఒక మనిషి ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీలు లేని సమాజాన్ని స్వతంత్ర సమరయోధులు ఆకాంక్షించారు అని చెప్పారు. అల్లూరి సీతారామరాజు ఒక అగ్నికణం అని కొనియాడారు. భీమవరం వచ్చిన ప్రధాని మోదీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు జగన్.

అల్లూరి జయంతి పురస్కరించుకొని వేడుకలు చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.ఆయన ఘనతను గుర్తుంచుకునే ఆయన పేరు పై జిల్లా ఏర్పాటు చేశామన్నారు. అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది అన్నారు. ఆయన తెలుగుగడ్డ పై పుట్టడం మన అందరి అదృష్టం అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని సీఎం జగన్ సత్కరించారు. ప్రధానికి విల్లంబు, సీతారాముల పటాన్ని బహుకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version