బ్రేకింగ్ : మరోసారి కరోనా బారినపడ్డ అక్షయ్ కుమార్..

-

కరోనా మహమ్మారి మరోసారి దాని ప్రభావాన్ని చూపుతోంది.. ఇప్పటికే కరోనా పుట్టినిల్లు చైనాలో కరోనా విజృంభణ కొనసాగుతుంటే.. ఇంతవరకు కరోనా కేసులే నమోదు లేని ఉత్తర కొరియాలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్ లో కూడా.. కరోనా బారిన సినీ, రాజకీయ ప్రముఖులు పడుతున్నారు.. అయితే గతంలో కరోనా సోకిన వారు మరోసారి కరోనా బారిన పడుతున్నారు. అయితే.. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డాడు.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. కొవిడ్ సోకడంతో ఈ నెల 17న ప్రారంభం కానున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు దూరమైనట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు కరోనా సోకిన విషయాన్ని ట్వీట్ చేస్తూ.. కేన్స్ 2022 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తనకు కరోనా సోకిందని, దీంతో విశ్రాంతి తీసుకుంటున్నానని రాసుకొచ్చాడు. కేన్స్‌ను తాను నిజంగా మిస్సవుతున్నట్టు అక్షయ్ పేర్కొన్నారు. కేన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొనే భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు అక్షయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version