ఇండియాలో కొత్తగా 2,487 కరోనా కేసులు, 13 మరణాలు నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంట ల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2,487 నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,20,254 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2878 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.77 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 13 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,214 కి చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 17, 692 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,91,32,94,864 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 15,58, 119 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,79, 693 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version