హీరోయిన్ అనుష్క శెట్టి.. సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. బాహుబలి సినిమా తో ఎంతటి పాపులారిటీ సంపాదించిందో మనకి తెలిసిన విషయమే. ఇక బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో సైజ్ జీరో అనే సినిమాను చేయడానికి ఓకే చెప్పింది అనుష్క. ఇక బాహుబలి సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే సైజ్ జీరో కోసం బాగా బరువు పెరగడంతో ఆ సినిమాని ఎంతో మనసుపెట్టి చేసింది కానీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అంతేకాకుండా ఆమెపై ట్రోలింగ్ కూడా చేయడం జరిగింది.

దీంతో ఇక అనుష్క ప్రతిసారీ కూడా బరువు పెరగడం మనం చూస్తూనే ఉన్నాము.. భాగమతి సినిమా తర్వాత అనుష్క నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గింది.. ఈ సినిమా ఓటిటి లో విడుదలైనా.. ఈ రెండు చిత్రాలు నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాయి. అయితే ఆ సినిమాల తరువాత అనుష్క మళ్లీ బరువు పెరిగి పోయింది. అందువల్ల ఆమె ఏ సినిమా చేయడానికి కూడా అంగీకరించడం లేదట. ఎలాంటి పెద్ద సినిమా డైరెక్టర్ వచ్చినా కూడా కథ చెబితే నేను చేస్తానని చెబుతోందట.

కాకపోతే ఈమె గురించి మాట్లాడితే ఆ ప్రాజెక్టుని చాలా సున్నితంగా తిరస్కరిస్తోంది. అనుష్క ప్రస్తుతం ఈమె మూవీ క్రియేషన్ లో ఒక సినిమాని చేయవలసి ఉండగా.. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలయింది. అనుష్క లేని సన్నివేశాలను ప్రస్తుతం తీసుకున్నారు కానీ అనుష్క మాత్రం ఇంకా షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు.. మిర్చి భాగమతి వంటి రెండు చిత్రాలు యూవీ మూవీ క్రియేషన్ బ్యానర్ పై నటించింది. ఈ రెండు చిత్రాలు హిట్ అవ్వగానే అనుష్క వాళ్ళ కి మధ్య సాన్నిహిత్యం మొదలైంది. అందుచేతనే అనుష్క వారి తో సినిమా చేయడానికి ఒప్పుకుంది. బరువు కారణంగానే అనుష్క సినిమాలు చేయలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version