Breaking: హీరోయిన్ సాయి పల్లవిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

-

సినీ తారలు ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. అలాంటి వారిలో హీరోయిన్ సాయిపల్లవి ఒకరు. ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ సాయిపల్లవి.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. డ్యాన్సర్‌గా, యాక్టర్‌గా అందరినీ ఫిదా చేసింది. కాగా ప్రస్తుతం తన మాటలతో వార్తల్లో నిలుస్తోంది. గతంలో కశ్మీరీ పండిత్‌ల హత్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.

హీరోయిన్ సాయిపల్లవి

సాయిపల్లవిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పలు విమర్శలు చేశారు. కశ్మీరీ పండిత్‌ల ఉదంతంపై ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిలోనూ ఆగ్రహాన్ని నింపింది. మతం పేరుతో దాడులు చేయడాన్ని తప్పుబట్టడంపై ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై పలువురు మండిపడుతున్నారు. కాగా తాజాగా హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌కు చెందిన భజరంగ్ దళ్ నాయకులు హీరోయిన్ సాయిపల్లవిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాతోపాటు గో రక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version