భైంసాలో టెన్షన్.. నిమజ్జనం దారి పొడుగునా భద్రతా వలయం!

-

నిర్మల్ జిల్లా బైంసాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. నేటి నుంచి గణేశ్ నిమజ్జనాలు ప్రారంభం నేపథ్యంలో పట్టణంలో అడుగడుగునా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.ఇటీవల జిల్లాలోని పలుచోట్ల చోటుచేసుకున్న అల్లర్ల కారణంగా పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. భైంసాలో భారీగా బలగాలను మోహరించారు. గడ్డెన్న ప్రాజెక్టు వాగు వద్ద గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలోనే 600 మంది పోలీసులతో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భైంసాలో దాదాపు 130 గణేశ్ మండపాల నుంచి నిమజ్జనం కోసం ప్రజలు వచ్చే చాన్స్ ఉండటంతో మరింత నిఘా ఏర్పాటు చేశారు. భైంసా పట్టణం నుంచి గణేశ్ నిమజ్జనాలు కొనసాగే ప్రాంతం వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.పోలీస్ ఉన్నతాధికారులు సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version