హోంమంత్రి అనిత వెళ్తున్న దారిలో యాక్సిడెంట్.. ఏం చేశారంటే?

-

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహానం ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న హోంమంత్రి అనిత వెంటనే తన కాన్వాయ్ ఆపించారు.

అనంతరం కారు దిగి బాధితుల దగ్గరకు వెళ్లారు. ఈ ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేశారు.హుటాహుటిన వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. గమనించిన స్థానికులు హోంమంత్రి చర్యలపై ప్రశంసలు కురిపించారు. కాగా, బాధితురాలికి వేగంగా వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news