సీఎం జగన్‌ మరో సంచలన నిర్ణయం…పేదలకు తక్కువ ధరలకే ఇంటి స్థలాలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని మధ్య తరగతి, పేద ప్రజలకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మరో ప్రజారంజక కార్యక్రమానికి పునాది వేయబోతున్నారు. ఏపీలోని… నగరాలు, పట్టణాల్లో… భూములు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో… తక్కువ ధరలకే మధ్య తరగతి కుటుంబాలకు ఇంటి స్థలాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు.

jagan

ఈ పథకంలో.. భాగంగా ప్రతి జిల్లాలో ఒక జగనన్న స్మార్ట్‌ టౌన్‌ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తొలుత ఐదు జిల్లాల్లో భూములను సమీకరించేందుకు అధికారులు డీపీఆర్‌ సిద్దం చేశారు. ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న అనంతపురం, కడప, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో తొలి దశలో లే ఔట్లు అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని చోట్ల ప్రైవేట్‌ భూములను ప్రభుత్వ ధర కంటే.. 5 రేట్లకు మించకుండా సేకరించనున్నారు. రైతులు, ప్రజల నుంచి అసైన్డ్‌ భూములను భూసమీకరణ కింద తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version