ఎన్నిసార్లు మ‌న‌సులు గెలుస్తావ‌య్యా.. 22మంది ప్రాణాలు కాపాడిన సోనూసూద్‌

-

ఆప‌దొస్తే ఇప్పుడు అంద‌రికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు సోనూసూద్‌. ఎవ‌రినైనా ఆదుకుంటాడ‌నే అంద‌రూ ఆయ‌న్ను దేవుడిలా కొలుస్తారు. గ‌తేడాది నుంచి ఆయ‌న చేస్తున్న సేవ‌లు వ‌ర్ణ‌నాతీతం. ఇక కరోనా స‌మ‌యంలో ఆయ‌న ఎన్నో సేవ‌లు చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు.

ఇక ప్ర‌స్తుతం క‌రోనా తీవ్ర‌త‌కు దేశంలో ఆక్సిజ‌న్ లేక రోజూ చాలా మంది చ‌నిపోతున్నారు. ఎంత ప్ర‌య‌త్నించినా ఆక్సిజ‌న్ అంద‌క అల్లాడుతున్న క‌రోనా పేషెంట్ల దుస్థితి నిత్యం సోష‌ల్ మీడియాలో క‌న్నీళ్లు పెట్టిస్తోంది. ఇక ఇలాగే ఆక్సిజ‌న్ అంద‌కి ఇబ్బండి ప‌డుతున్న 22మంది ప్రాణాల‌ను సోనూసూద్ కాపాడారు.

బెంగళూరులోని ఆర్క్ ఆస్ప‌త్రిలో ఆక్సీజన్ సిలిండర్లు ఖాళీ కావడంతో 22మంది పేషెంట్లు ఇబ్బంది ప‌డ‌సాగారు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న సోనూసూద్‌.. గంటల వ్యవధిలోనే 15 ఆక్సిజన్ సిలిండర్లు రెడీ చేశారు. వెనువెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి వారి ప్రాణాలు కాపాడారు. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌జ‌లు ఆయ‌న్ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version