Sukhibhava Sharath: “అందుకే నాపై దాడి చేశారు”.. షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన సుఖీభవ శరత్

-

Sukhibhava Sharath: ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ..’ అంటూ ఓ చిన్న వీడియోతో ఓవర్ నైట్లో పాపుల‌ర్ అయ్యాడు హైదరాబాద్ యువకుడు శరత్. మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. శరత్ పై మొన్న ఆదివారం దాడి జరిగింది. రక్తం కారేలా విచక్షణారహితంగా కొట్టారు కొంత‌మంది. ఆ స‌మ‌యంలో గాయ‌పడింది శరతేనా? అనేలా.. గుర్తు ప‌ట్ట‌డానికి వీలు లేకుండా ముఖం మొత్తం ర‌క్తం నిండిపోయింది.

ఈ ఫోటోలు వైరలయ్యాయి. అయితే, ఈ దాడిపై భిన్న ప్రచారాలు జోరందుకున్నాయి. దీంతో ఈ విష‌యం పోలీసుల వద్దకు చేరింది. దాడిపై ఆరా తీయ‌డంతో శ‌ర‌త్ షాకింగ్ వెల్లడించాడు. ఈ క్రమంలో షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేశాడు.

శరత్ రెడ్డి అలియాస్ సుఖీభవ శరత్ అలియాస్ నల్లకుంట శరత్.. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా దాడి చేశారు. సుఖీభవ ప్రకటనను అనుకరిస్తూ హిజ్రాలను హేళన చేసినందుకు కోపంతో హిజ్రాలే.. శరత్ పై దాడి చేసినట్లు తొలుత ప్రచారం జరిగింది. మతం కోణంలోనూ కామెంట్లు వచ్చాయి. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చి త‌న షాకింగ్ గ‌తాన్ని వెల్ల‌డించారు.

సాయి, హరి అనే వారితో త‌న‌కు గొడవలున్నాయనీ, గతంలో త‌న‌ చెల్లిని వేధించినందుకు వారిపై దాడి చేశాన‌ని తెలిపారు. ఆ కేసులో త‌ను జైలుకు కూడా వెళ్లానని.. బెయిల్ పై బయటికి వచ్చినని తెలిపారు. సుఖీభవ్ వీడియో తర్వాత పాపులారిటీ పెరిగి, సినిమా ఆఫర్లు కూడా వస్తుండటంతో ఓర్చుకోలేకే వ్యతిరేక వర్గంవాళ్లు దాడికి పాల్పడ్డారని శరత్ తెలిపాడు.

దాడి గురించి రామగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని శరత్ చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల రెడ్ లేబుల్ టీపొడి ప్రకటనను అనుకరిస్తూ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ..’ వీడియోతో పాపులారిటీ పొందడం, అతనిపై వేలాదిగా మీమ్స్ వస్తుండటం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version