మరోసారి హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం..

-

హైదరాబాద్‌ నగరంలో మెట్రో ప్రయాణికులకు ఈ రోజు ఉదయం తీవ్ర అసౌకర్యం ఎదురైంది. మియాపూర్ నుండి ఎల్‌బీ నగర్‌కు వెళ్లే మెట్రో రూట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రైన్ నిలిచిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు భరత్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అపారమైన ఇబ్బందులకు గురయ్యారు.

అధికారుల వివరాల ప్రకారం, ఇది పూర్తిగా సాంకేతిక లోపమేనని తెలుస్తోంది. ప్రయాణీకులు ట్రైన్‌లో గంటల తరబడి వేచిచూసిన పరిస్థితి నెలకొంది. అయితే కొద్దిసేపటికి మెట్రో సేవలు మళ్లీ నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ట్రైన్లు ఇంకా నిరంతరంగా సాంకేతిక తేడాలతో నిలుస్తుండడంతో ప్రయాణికుల ఆగ్రహానికి గురవుతున్నాయి.

ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో, మెట్రో సేవల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల నిత్య ప్రయాణానికి కీలకమైన మెట్రోలో ఎప్పటికప్పుడు ఇలాంటి అంతరాయాలు ఏర్పడటం ప్రయాణికుల ఆందోళనకు కారణమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news