నాకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

-

కేంద్రంలోని బీజేపీ సర్కారు అఘాయిత్యాలను ఎదిరిస్తూ ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్న తనకు నోబెల్‌ బహుమతిని ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ మొదటి నుంచి తనపై కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నందని ఆయన ఆరోపించారు.తన పాలనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. ఢిల్లీలో ఏ గల్లీకి వెళ్లినా తాము మిమ్మల్నే నమ్ముకున్నామని అంటున్నారని ఆయన అన్నారు.అంతే కాక తమ జీవితాలను మార్చాలని జనం చెబుతున్నారని కేజ్రీవాల్‌ వెల్లడించారు.

ఢిల్లీలో తనను స్కూళ్లు, హాస్పిటల్స్ కట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని తీవ్ర విమర్శలు గుర్తించారు.వాళ్ల పిల్లలతో సమానంగా సామన్యుల పిల్లలు కూడా చదువుకోవడం బీజేపీ పాలకులకు అస్సలు ఇష్టంలేదని ఆయన విమర్శించారు. బీజేపీ కుట్రలను ఎదుర్కొంటూ ఢిల్లీలో పరిపాలన కొనసాగిస్తున్నా తనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఢిల్లీ వాసులు సరైన సమాధానం చెబుతారని ముఖ్యమంత్రి  కేజ్రీవాల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version