టిడిపి కోసం అవసరమైతే చస్తాను: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

-

టిడిపి కోసం అవసరమైతే చేస్తానని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ లో జరిగిన టిడిపి మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలువురు టిడిపి మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానాడులో సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని పై అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు.

ఎన్టీరామారావు మోచేతి నీళ్లు తాగిన కొడాలి నాని నేడు చంద్రబాబు ను విమర్శిస్తారా..? శ్రీకాకుళం వచ్చి సన్నబియ్యం ఇస్తానని, రెండేళ్ళ తరువాత మాట మార్చిన ఘనుడు నానీ, పేకాట క్లబ్ నడిపి,క్యాసినో నిర్వహిస్తూ డబ్బులు కుప్పేసుకున్న చరిత్ర నానిదని విమర్శించారు. నా పై 11 కేసులు పెట్టారు, ఈ వయసులో నాపై రేప్ కేసు పెట్టడం బాధాకరం అని అన్నారు. నేను ఎవరికీ భయపడే రకం కాదు.. రాష్ట్రంలో మోసపూరిత పథకాలు అమలు చేస్తున్న జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు అని అన్నారు అయ్యన్న పాత్రుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version