నాపై నమ్మకంతో గెలిపించినందుకు మీ కష్టాల్లో తోడుంటా : మైనంపల్లి రోహిత్

-

యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజల కష్టాల్లో తోడుంటానని ,ఎవరికి ఏ ఆపద వచ్చిన తనను సంప్రదించాలని సూచించారు.ఇవాళ మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో అంగన్వాడీ, పశువైద్యశాల, పొడిచన్పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనము,పశు వైద్యశాలను ప్రారంభించారు.

అనంతరం లక్ష్మీ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కుర్తివాడ, దౌలాపూర్, యూసఫ్ పేట, రాజ్యా, డాక్య తండాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.పేద ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఎల్లాపూర్ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ, పొడిచన్పల్లి ఉన్నత పాఠశాలకు మరుగుదొడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version